లోక్సభలో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభలో చేటు చోసుకున్న అంశంపై ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు. లోక్సభ స్పీకర్ పోడియానికి ముగ్గురు భాజపా ఎంపీలు నోట్ల కట్టలతో కూడిన బ్యాగులలోకి వచ్చి కలకలం సృష్టించిన విషయం తెల్సిందే.
దీనిపై సభా కార్యక్రమాలను గంటన్నర పాటు వాయిదా వేశారు. ఓ వైపు అఖిలపక్ష నేతలతో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కేంద్ర మంత్రివర్యులతో ప్రధాని మన్మోహన్ సింగ్ మంతనాలు జరుపుతున్నారు.
|