ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జమ్మూ-కాశ్మీర్ రోడ్డు ప్రమాదం : 15మంది మృతి  Search similar articles
జమ్మూ-కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోగా, మరో 29మంది తీవ్రగాయాలకు గురైయ్యారు. బుధవారం ఉదయం కొండ నుంచి అదుపుతప్పి లోతైన లోయలో పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.

శ్రీనగర్‌ నుంచి జమ్మూకు పయనించిన ఈ బస్సు, రాంబన్ జిల్లాలోని షెరిబి ప్రాంతంలో అదుపుతప్పి 400 అడుగుల లోతైన లోయలో పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సైనికులు రంగంలోకి దిగి, 13 మృతదేహాలను వెలికితీశారు.

తీవ్రగాయాలకు గురైన మరో 31మంది ప్రయాణీకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరో ఇద్దరు మరణించారు. జమ్మూ, ఉదంపూర్ ప్రాంతాల్లోని ఆస్పత్రులలో 25మంది గాయపడిన ప్రయాణీకులు చికిత్స పొందుతున్నారు.
మరిన్ని
"మాయ"తో విపక్షాల భేటీ ప్రారంభం!
సీపీఎం నుంచి సోమనాథ్‌ బహిష్కరణ..?
పీఎంగా అద్వానీని అంగీకరిస్తారా..? - ప్రధాని ప్రశ్న
'విశ్వాసం'లో యూపీఏ ఘన విజయం
విశ్వాస పరీక్షలో యూపీఏ ముందంజ
ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్