ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ప్రధాని ఆర్థిక మండలికి రంగరాజన్ గుడ్‌బై!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రధాని ఆర్థిక మండలికి రంగరాజన్ గుడ్‌బై!
రాష్ట్రంలో కొనసాగుతున్న రాజీనామాల పరంపర ప్రస్తుతం కేంద్రం వరకూ పాకింది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) ఛైర్మన్ పదవికి సి. రంగరాజన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే అందుకు తగిన కారణాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా, ప్లానింగ్ కమిషన్‌లో సభ్యుడిగా కూడా పనిచేసిన రంగరాజన్, 1992-97 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు.

మరోవైపు, ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇక అధ్యాపకుడి అవతారమెత్తేందుకు సిద్ధమయ్యారు. ఆయన సింగపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఆసియన్ స్టడీస్ లీకువాన్‌‌‌‌‌‌‌‌యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థల్లో పనిచేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సింగపూర్ బయలు దేరనున్నారు.

2004 నుంచి తనకు మీడియా సలహా దారుగా పనిచేసిన సంజయ్‌కు గురువారం ప్రధాని వీడ్కోలు విందునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, బిమల్ జలాన్, ఈఏసీ ఛైర్మన్ రంగరాజన్ కూడా హాజరయ్యారు. అయితే శుక్రవారం ఉన్నట్టుండి రంగరాజన్ తన పదవికి రాజీనామా చేసే కారణాలు తెలియరాలేదు.
మరిన్ని
1942 ఆగస్టు 8... క్విట్ ఇండియా తీర్మానం
మహిళా బిల్లు ఇక లేనట్టే: సుష్మా స్వరాజ్
అమర్‌నాథ్ వ్యవహారం : భాజపా ఆందోళనలు
అమర్‌నాథ్ వ్యవహారం: కమిటీ ఏర్పాటు
"అణువు"పై విస్తృత ప్రచారం : రాహుల్
సిమిపై నిషేధం కొనసాగింపు : సుప్రీం