ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మళ్లీ భారత్‌ను ఆశ్రయించిన తస్లీమా నస్రీన్!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మళ్లీ భారత్‌ను ఆశ్రయించిన తస్లీమా నస్రీన్!
వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తిరిగి భారత్‌ను ఆశ్రయించారు. గత నవంబరులో దేశాన్ని వీడి స్వీడన్ వెళ్లిన తస్లీమా శుక్రవారం కోల్‌కతా చేరుకున్నారు, విమానం నుంచి దిగీదిగగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. భారత్‌ ఆశ్రయంలోనే ఉండేందుకు తస్లీమాకు ఈ నెల ఆగస్టు 12వ తేదీ వరకే వీసా అనుమతి ఉంది.

అయినప్పటికీ భారత్ ఆశ్రయాన్ని కొనసాగించుకోవాలని తస్లీమా భావించారు. అయితే నస్రీన్ వీసాను పొడగించరాదని కొన్ని ముస్లీం సంఘాలు ఆందోళన చేపట్టడంతో పాటు మరి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య పశ్చిమబెంగాల్‌ నుంచి ఆమె స్వీడెన్‌కు తరలించబడ్డారు.

ఇదిలా ఉండగా.. తస్లీమా రచించి, వెలువరించిన 'లజ్జ', 'ద్విఖండిత' రచనల కారణంగా ఆమె వివాదాల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. దీంతో ఆమెపై దాడులు జరగడం, వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగడంతో ఆమె భారత్‌ను వీడిపోవాల్సి వచ్చింది. కాగా, భారత్‌ ఆశ్రయంలో తస్లీమా ఇక ఏ ప్రాంతంలో ఉంటారనే అంశంపై ఇంకా వివరాలు తెలియరాలేదు.
మరిన్ని
సిలిగురిలో బాంబు పేలుడు : బాంబులు నిర్వీర్యం
పూంచ్‌లో కర్ఫ్యూ : రంగంలోకి సైనికులు
సీపీఎంలో చేరే ప్రసక్తే లేదు : స్పీకర్
దేశ రాజధానిలో భారీ వర్షం: ట్రాఫిక్ జామ్
ప్రధాని ఆర్థిక మండలికి రంగరాజన్ గుడ్‌బై!
1942 ఆగస్టు 8... క్విట్ ఇండియా తీర్మానం