అస్సాంలోని బొంగైగాన్ జిల్లాల్లో శనివారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాదులు దేశంలోని అనేక ప్రాంతాల్లో పంజా విసురుతున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అస్సాంలోని బొంగైగాన్ జిల్లాలో స్వహిద్ బేడి పోలీస్ చెక్ పోస్ట్, పగ్లథాన్లలో బాంబు పేలుడు సంభవించింది.
స్వహిద్ బేడి ప్రాంతంలో శనివారం ఉదయం ఈ బాంబు పేలుడు సంభవించిందని, మరో ఐదు నిమిషాల వ్యవధిలోనే పగ్లథాన్ ప్రాంతంలో రెండో బాంబు పేలిందని పోలీసులు వివరించారు. ఈ బాంబు పేలుడు ఘటనలో వాటిల్లిన నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉండగా, శుక్రవారం (ఆగస్టు 15)న అస్సాంలోని చిరంగ్ పరేడ్ గ్రౌండ్స్, దుబ్రీ జిల్లాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇద్దరు తీవ్రగాయాలకు గురైయ్యారు.
|