కాశ్మీర్లో శాంతిభద్రతల పరిస్థితి రోజు రోజురోజుకు దిగ జారుతోందని నేషనల్ కాన్ఫిరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం చక్కదిద్ద లేకపోతే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తుందని తెలిపారు.
అమరనాథ్ భూవివాదంతో జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో దహనకాండ్ జరుగుతున్న విషయం తెలిసిందే. భూమి కేటాయింపును రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ముజఫరాబాద్ మార్గాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
|