సింగూర్ సమస్య పరిష్కారం కోసం శాంతి మార్గాలను అన్వేషించడానికి బెంగాల్ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందుకోసం ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం కోసం రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని రంగంలోకి దింపింది. ఆయన ఇప్పటికే ఇరు వర్గాల నేతలతో ప్రాథమిక చర్చలు జరిపారు. రెండో రోజు చర్చల్లో భాగంగా శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రభుత్వ ప్రతినిధులతో గవర్నర్ చర్చలు జరుపనున్నారు.
దీనిపై రాజ్భవన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సింగూర్ సమస్య పరిష్కారానికి ఇరు వర్గాల ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు జరిపేందుకు గవర్నర్ చర్యలు చేపట్టారని అందులో పేర్కొంది. ఇందులోభాగంగా తలెత్తే సమస్యలకు న్యాయపరమైన సలహాలను ముంబై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చిత్తోష్ ముఖర్జీ ఇస్తారని పేర్కొంది.
|