ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఢిల్లీ పేలుళ్లు: మణిపాల్ వర్శిటీ విద్యార్థి అరెస్టు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఢిల్లీ పేలుళ్లు: మణిపాల్ వర్శిటీ విద్యార్థి అరెస్టు
ఢిల్లీ వరుస పేలుళ్ళ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలుసులు రోజురోజుకు పురోగతి సాధిస్తున్నారు. తాజాగా.. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఒక విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సిక్కింలోని మణిపాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యాభ్యాసం చేస్తున్న ఈ విద్యార్థిని కర్ణాటక రాష్ట్రంలో అరెస్టు చేశారు. ఢిల్లీ వరుస పేలుళ్ళ అనంతరం కేంద్ర హోం శాఖతో పాటు నిఘా వ్యవస్థపై తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.

దీంతో మేల్కొన్న నిఘా సంస్థలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగాలను అప్రమత్తం చేశాయి. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న హోటల్స్, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ బెంగుళూరులో ఈ విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థి వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. సిక్కిం క్యాంపస్‌లోని ఎవరైనా విద్యార్థులకు పేలుళ్ళతో సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని
బెంగాల్ ప్రభుత్వానికి మమతా బెనర్జీ గడువు
తీవ్రవాదంపై యూపీఏ మెతకవైఖరి: అద్వానీ
విదేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మన్మోహన్
నేటి నుంచి రాహుల్ పంజాబ్ పర్యటన
ఢిల్లీ పేలుళ్లు: మరో ముగ్గురి అరెస్టు
ఖైర్లాంజీ నిందితులకు 24న శిక్షలు ఖరారు