సింగూర్ వివాదం పరిష్కారమైంది. రాజకీయ పార్టీలు, ఫ్యాక్టరీ యాజమాన్యం మధ్య కుదిరిన సయోధ్యతో కాదు. భూ వివాద సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ఉద్యోగులు, కాంట్రాక్టర్ల భద్రత కారణంగా నానో కార్ల ప్రాజెక్టు సింగూర్ నుంచి నిష్క్రమించనుంది. ఈ విషయాన్ని టాటా మోటార్స్ ఛైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యతో రతన్ టాటా రెండు గంటల పాటు సమావేశమయ్యారు. వీరిద్దరు నానో కార్ల ప్రాజెక్టుతోపాటు.. సింగూర్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. సమావేశానంతరం రతన్ టాటా మీడియాతో మాట్లాడారు. చాలా విషాదకరం. వెస్ట్ బెంగాల్ నుంచి నానో ప్రాజెక్టును తరలించాలని నిర్ణయించాం. తమ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల క్షేమాన్ని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నామని రతన్ టాటా స్పష్టం చేశారు. |
| సంబంధిత సమాచారం కోసం శోధించండి. |
|