హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కోటిఘాట్ నుంచి రాష్ట్ర రాజధాని సిమ్లాకు వెళుతున్న ఒక బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. ఫగు అనే ప్రాంతానికి సమీపంలోని లంభి అనే ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు కొంత మంది ప్రయాణికులతో కూడిన ప్రైవేట్ బస్సు కోటిఘాట్ నుంచి సిమ్లాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పారు. గాయపడిన వారిలో ఆరుగురు ప్రయాణికులను ఇంధిరాగాంధీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. |