ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > చిరుతిళ్లు, మద్యం కూడా వినాశకాలే : రాందాస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరుతిళ్లు, మద్యం కూడా వినాశకాలే : రాందాస్
చిరుతిళ్లు, మద్యం లాంటివి దేశ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్ పేర్కొన్నారు. అందుకే చిరుతిళ్లు, మద్యం, మత్తు పదార్థాలు లాంటివాటిని దశలవారీగా నియత్రంచాల్సిన అవసరం ఉంది ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై ముంబయిలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి రాందాస్ మాట్లాడుతూ చిరుతిళ్లు, మద్యం, మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి యువత తల్లితండ్రులకు తెలియడం లేదని పేర్కొన్నారు. అందుకే ఈ విషయం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని అన్నారు.

గతంలో పొగతాగడం ద్వారా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, దీనివల్ల చుట్టుపక్కలవారి ఆరోగ్యం సైతం బాధించబడుతోందన్న కారణంగా బహిరంగ ప్రదేశాల్లో పొగ నిషేధం చట్టాన్ని అమలులోకి తెచ్చేలా చేసిన రాందాస్ తాజాగా చిరుతిళ్లు, మద్యం వ్యసనాలపై కూడా దృష్టి సారించడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అయ్యప్ప భక్తులకు అధనపు భద్రత : ఆంటోనీ
కాంగ్రెస్‌ను రద్దు చేయాల్సింది ప్రజలే : మోడీ
ఒమన్‌లో ప్రధాని : సంయక్త నిధి ఏర్పాటు
హద్దుదాటే ప్రయత్నం : ముగ్గురు తీవ్రవాదుల హతం
మీరట్‌లో పేలుళ్లు : ఐదుగురు మృతి
ఆర్మీ ఆస్పత్రి నుంచి సోమనాథ్ డిశ్చార్జ్