ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కూలిన మిగ్-23 విమానం : ఫైలట్లు సురక్షితం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కూలిన మిగ్-23 విమానం : ఫైలట్లు సురక్షితం
భారత విమానయాన సంస్థ (ఐఏఎఫ్)కు చెందిన మిగ్ విమానాలు కూలిపోవడం అనే సమస్య కొనసాగుతూనే ఉంది. తాజాగా ఐఏఎఫ్‌కు చెందిన మిగ్-23 అనే యుద్ధ విమానం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఫైలట్లు సురక్షితంగా బయటపడడం గమనార్హం.

పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్ దార్ ప్రాంతంలో ఈ మిగ్-23 విమానం కూలిపోయింది. హసీ మరా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ప్రమాదానికి గురయ్యింది. అయితే విమానం కూలినా అందులో ప్రయాణించిన ఇద్దరు ఫైలట్లు క్షేమంగా బయటపడ్డారు.

ప్రస్తుతం కూలిపోయిన మిగ్-23 విమానంతో కలిసి ఈ ఏడాదిలో ఐఏఎఫ్‌కు చెందిన విమాన ప్రమాదాల సంఖ్య ఐదుకు చేరింది. ఐఏఎఫ్‌లో ప్రమాదాల సంఖ్య పెరగడంపై సంస్థ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉత్తర బెంగాల్ ప్రాంతంలోనే మిగ్-21, మిగ్-27 యుద్ధ విమానాలు సైతం కూలిపోయిన విషయంలో తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మాలేగావ్ పేలుళ్ల కేసు : సాధ్వీకి కస్టడీ పొడిగింపు
పురోహిత్‌ వద్ద హర్యానా రైల్వే పోలీసుల విచరాణ
న్యూఢిల్లీకి చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు
కంధమాల్ జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం
జమ్మూ-కాశ్మీర్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభం
నిఘా నీడలో జమ్మూకాశ్మీర్ బ్యాలెట్ పోరు