ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలో ఒక పెళ్ళిబృందం వ్యాను బోల్తాపడిన దుర్ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. అలాగే.. మరో 31 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో క్షతగాత్రులలో మరో 12 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
దీనిపై సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీసు బి.డి.పౌల్షన్ మాట్లాడుతూ... పాణిపట్కు చెందిన పెళ్లిబృందం స్టేషనరీ లోడుతో వెళుతున్న ట్రక్కు బాబ్రి అనే ప్రాంతం వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో ఢీకొన్నట్టు చెప్పారు.
కాగా, ఈ ప్రమాద స్థలంలోనే 14 మంది మృత్యువాత పడగా, మరో 31 మంది గాయపడినట్టు చెప్పారు. వీరందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను ఢిల్లీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. |