ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మాలేగావ్ పేలుళ్ళ నిందితులపై 'మోకా' ప్రయోగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మాలేగావ్ పేలుళ్ళ నిందితులపై 'మోకా' ప్రయోగం
దేశంలో పెనుసంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ళ కేసులో అరెస్టు చేసిన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌తో పాటు ఇతర నిందితులపై మహారాష్ట్ర సమీకృత నేరాల చట్టం (మోకా)ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. ఈ చట్టం ప్రయోగించిన వారిలో ప్రజ్ఞాసింగ్‌తో సహా, మత గరువురు దయానంద్ పాండే, ఆర్మీ అధికారి ఒకరు ఉన్నారు. వీరిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ చట్టం నిబంధనల మేరకు ఒక వ్యక్తి మరణానికి ఎవరైనా కారణభూతులైనట్టయితే.. వారికి గరిష్టంగా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా నేరం రుజువైతే జీవిత ఖైదు, నేరాల్లో పాలుపంచుకున్నట్లు తేలితే ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తారు. కాగా, మాలేగావ్ పేలుళ్ళ కేసులో ఇప్పటి వరకు మొత్తం పది మందిని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక (ఏటీఎస్) అరెస్టు చేసిన విషయం తెల్సిందే.

పేలుళ్ళపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు ఏటీఎస్ జాయింట్ కమిషనర్ హేమంత్ కర్కారే వెల్లడించారు. పురోహిత్‌కు, సుధాకర్ చతుర్వేదికి సంబంధాలు ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైనట్టు ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యురేనియం నిక్షేపాల అన్వేషణకు కృషి: కకోద్కర్
సైనికులూ సెల్‌ వాడకం తగ్గించండి : రామ్‌దేవ్
ఆర్ధిక అత్యవసర పరిస్థితి రానుంది : అద్వానీ
రాహుల్ క్షమాపణ కోరలేదు : సిక్కుల విమర్శ
మాలేగావ్ నిందితులపై మోకా చట్టం ప్రయోగం
లంచగొండిని నిర్మూలించాలి: అబ్దుల్ కలాం