ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఆలయాల కూల్చివేతను నిలిపివేసిన మోడీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆలయాల కూల్చివేతను నిలిపివేసిన మోడీ
FileFILE
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆలయాల కూల్చివేతను నిలిపివేసింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైన విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్ వంటి సంఘ్ పరివార్ వంటి శక్తులు తెచ్చిన ఒత్తిడికి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తలొగ్గారు. దీంతో గాంధీనగర్‌లోని అనధికార ప్రాంతాల్లో వెలసిన ఆలయాలు, మసీదులు, చర్చిల కూల్చివేతకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు.

గుజరాత్‌లో ఇప్పటికే 200 ఆలయాలకు పైగా భాజపా ప్రభుత్వం కూల్చి వేయగా, వీటిలో ఎక్కువగా హిందూ ఆలయాలు ఉన్నాయి. ఈ అంశంపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గుజరాత్‌లో మహ్మద్ గజనీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. గజనీ పాలనలో కూడా వందలాది హిందూ ఆలయాలను కూల్చి వేసినట్టు చరిత్ర చెపుతోంది.

అలాంటి పాలనే ప్రస్తుతం గుజరాత్‌లో సాగుతోందని వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ ఆరోపించారు. అంతేకాకుండా సమస్యపై చర్చించేందుకు ఆయన నరేంద్ర మోడీతో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చల అనంతరం ఆలయాల కూల్చివేతను నిలిపివేస్తున్నట్టు మోడీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఆలయాల కూల్చివేత హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వీహెచ్‌పీ అభిప్రాయపడింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇందిరా నిర్ణయమే ఆర్థిక వ్యవస్థకు రక్ష: సోనియా
'పొగ'పై పోరాటం ఆపబోం : కేంద్రం స్పష్టీకరణ
రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది : లాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ధోబి పోటి
సంక్షోభాన్ని అధిగమిస్తాం.. వృద్ధి సాధిస్తాం: ప్రధాని
మాలేగావ్ పేలుళ్ళ నిందితులపై 'మోకా' ప్రయోగం