ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > తీరప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తీరప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ముంబయి‌లో జరిగిన ఉగ్రవాదుల దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో 195 మంది చనిపోగా 300 మంది గాయపడ్డారు. దీంతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్‌‌పాటిల్ ఉన్నతాధికారులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీరప్రాంతాలు, మహానగరాల ప్రత్యేక రక్షణ కొరకు 500 కోట్ల రూపాయలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

దీంతోపాటు దేశంలోని 72 తీరప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్గత, సరిహద్దు భద్రతా విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతామండలి సలహాసంఘ సభ్యులు ఎం.కె. నారాయణన్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా, గూఢచార విభాగం డైరెక్టర్ పి.సి. హాల్దార్, అంతర్గత భద్రతా‌విభాగ కార్యదర్శి ఎం. ఎల్. కుమావత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
195కు పెరిగిన ముంబై మారణహోమం మృతులు  
తమిళనాడులో నిశా మృతులు 115
ఢిల్లీ అసెంబ్లీకి ప్రారంభమైన పోలింగ్
లష్కరే-ఇ-తోయిబా ఆధ్వర్యంలో శిక్షణ: ముంబై తీవ్రవాది
తాజ్ హోటల్ ట్రైనీ చెఫ్‌గా తీవ్రవాది!
తాజ్‌ హోటల్‌లో ముగిసిన 'ఆపరేషన్ సైక్లోన్'