ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > అయిదు వేలమందిని చంపాలన్నదే లక్ష్యం: పాటిల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అయిదు వేలమందిని చంపాలన్నదే లక్ష్యం: పాటిల్
FILE
ముంబై నగరంలో 5 వేలమంది ప్రజలను చంపాలన్న లక్ష్యంతోటే ఉగ్రవాదులు పథకాలు రచించారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్ ఆర్ పాటిల్ చెప్పారు. అయితే ఉగ్రవాదుల దాడుల్లో స్థానికుల పాత్ర ఉందనడానికి ఎలాంటి రుజువులూ లేవని తెలిపారు.

కాగా, ముంబై పోలీసులు సజీవంగా పట్టుకున్న ఉగ్రవాది, పేలుడు పదార్ధాలు నిల్వచేయడానికి తాము తాజ్ హోటల్లో గదిని బుక్ చేసుకున్నట్లు ఇంటరాగేషన్‌లో వెల్లడించాడని పాటిల్ చెప్పాడు. తమ వెంట తెచ్చుకున్న సామగ్రితో కనీసం అయిదు వేలమంది ప్రజలను చంపాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

అయితే ఉగ్రవాదులలో ఒకరు గతంలో ఓబెరాయ్ హోటల్‌లో కూడా పనిచేశాడని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. కాగా, తాజ్ హెరిటేజ్ హోటల్‌ను పేల్చివేయాలని కూడా ఉగ్రవాదులు భావించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తీరప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
195కు పెరిగిన ముంబై మారణహోమం మృతులు  
తమిళనాడులో నిశా మృతులు 115
ఢిల్లీ అసెంబ్లీకి ప్రారంభమైన పోలింగ్
తాజ్‌ను పేల్చేయాలన్నదే మా లక్ష్యం: ముంబై తీవ్రవాది
తాజ్ హోటల్ ట్రైనీ చెఫ్‌గా తీవ్రవాది!