వాణిజ్య రాజధాని ముంబైలోని దేశీయ మార్కెట్ భవనాన్ని పేల్చేస్తామని దక్కన్ ముజాహిదీన్ (డిఎం) తీవ్రవాద సంస్థ తాజాగా మరో ఈమెయిల్ బెదిరింపులు చేసింది. అంతేకాకుండా ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా బాంబులతో దహనం చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గుజరాత్ పోలీసులకు దక్కన్ ముజాహిదీన్ ఈమెయిల్ బెదిరింపును పంపింది.
దీంతో దేశంలోని అన్ని విమానాశ్రయాలతో పాటు.. ప్రభుత్వ కీలక భవనాలకు, ఆలయాలకు భద్రతను మరింత పటిష్టం చేశారు. ముంబై మారణహోమానికి పాల్పడింది తామేనని దక్కన్ ముజాహిదీన్ తొలుత ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఉగ్రవాదుల ఘాతుకాన్ని దేశ భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ తీవ్రవాద సంస్థ తాజాగా హెచ్చరించడం గమనార్హం. |