ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > 2011 నాటికి మరో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రారంభం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
2011 నాటికి మరో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రారంభం
2011 నాటికి భారత్‌లో మరో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని భారత అణు శక్తి సంఘం ఛైర్మన్ అనిల్ కకోడ్కర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ భారత్ ఎనర్జీ ఫోరం కాన్ఫరెన్స్‌లో కకోడ్కర్ గురువారం పాల్గొన్నారు. థోరియం టెక్నాలజీతో అణు శక్తిని ఉత్పత్తి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. అణు శక్తి ఉత్పత్తికి థోరియం ఉపయోగించడం తమ అంతిమ లక్ష్యమని తెలిపారు. థోరియానికి సంబంధించి అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు.

భారతదేశంలో పెద్ద మొత్తంలో థోరియం నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో నాణ్యత కలిగిన థోరియం మనదేశంలో ఉందని వివరించారు. భవిష్యత్తులో అణు శక్తి ఉత్పత్తికి థోరియం ప్రదాన ఇంధనం అవుతుందని గుర్తుచేశారు. మనదేశంలో తక్కువ మొత్తంలో యురేనియం నిల్వలు ఉన్నాయన్నారు. అణు శక్తి ఉత్పత్తిలో భారత్ దగ్గర అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని వివరించారు.

ప్రపంచ దేశాలన్నీ అణు శక్తి ఉత్పత్తికి దూరంగా ఉంటుంటే మనం అందుకు విరుద్ధంగా ముందుగా సాగుతున్నామని చెప్పారు. ఈ విషయంలో భారత్ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుందని కకోడ్కర్ వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉగ్రవాదుల ఆటలిక సాగవు: ప్రధాని  
వారిద్దరి ప్రసంగాలే నాకు ప్రేరణ.. స్ఫూర్తి: కసబ్
మూడు విమానాశ్రయాలకు ఈమెయిల్ హెచ్చరిక
నైతిక బాధ్యత వహించి తప్పుకున్నా: దేశ్‌ముఖ్
లష్కరే తీవ్రవాదుల తదుపరి గురి ఢిల్లీపై!
భారత్‌ స్నేహాన్ని బలహీనంగా భావించొద్దు: సోనియా