ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > బెంగుళూరులో విద్యార్థి కాల్చివేత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బెంగుళూరులో విద్యార్థి కాల్చివేత
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో భద్రతా దళాలు ఒక విద్యార్థిని కాల్చి చంపాయి. అనుమానాస్పద రీతిలో బ్రిగేడియర్ నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన మహ్మద్ ముకరం అనే విద్యార్థిని ఆదివారం ఉదయం కాల్చి చంపాయి. బెంగుళూరు విమానాశ్రయం రోడ్డులో ఆర్మీ క్యాంపు ఉంది. ఈ కార్యాలయంలోకి గోడ దూకి వెళ్లేందుకు స్థానిక కళాశాలకు చెందిన విద్యార్థి ప్రయత్నించాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది హెచ్చరికలు జారీ చేసినప్పటికీ విద్యార్థి పెడచెవిన పెట్టాడు. దీంతో అతన్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. ముంబైపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిశితంగా విచారిస్తున్న విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు: ఒమర్ అబ్దుల్లా
ఏప్రిల్-మే నెలలో లోక్‌సభ ఎన్నికలు: సీఈసీ
జమ్మూకాశ్మీర్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
నైతిక బాధ్యత వహించే రాజీనామా: దేశ్‌ముఖ్
కర్ణాటకలో ప్రశాంతంగా ఉప ఎన్నికల పోలింగ్
యుద్ధం మీడియా సృష్టే: కేంద్ర మంత్రి జైరామ్