ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > డబ్బుకోసం కాదు...గౌరవంకోసం...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డబ్బుకోసం కాదు...గౌరవంకోసం...
సైనిక దళాలు చేసిన కొన్ని డిమాండ్‌లపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ నూతన సంవత్సర కానుకగా వారి కోరికలను మన్నించి వేతనాల పెంపు బిల్లును ఆమోదించిన విషయం విదితమే. కాని వేతనాల కోసం ప్రభుత్వంతో సైనికాధిపతులు జరిపిన పోరాటం డబ్బుకోసం కాదని ఇతర సర్వీసులతో సమానార్హత, గౌరవం కోసమేనని మాజీ నావికా దళాధిపతి అడ్మిరల్ విష్ణు భగవత్ పేర్కొన్నారు.

ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో మాజీ సైనికాధికారి కెప్టెన్ రవి, ప్రభుత్వ మాజీ కార్యదర్శి యు.సీ. అగర్వాల్‌తోబాటు భగవత్ పాల్గొన్నారు. వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని అమలు చేయకూడదని సైనిక దళాల అధిపతులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి.

అధిక వేతనాల కోసం పట్టుబట్టినంత మాత్రాన కేంద్రంపై తిరుగుబాటుగా భావించకూడదని భగవత్ అభిప్రాయపడ్డారు. ఇతర సర్వీసులతో సమాన అర్హత, గౌరవ మర్యాదలు కల్పించాలనేదే వారి డిమాండని ఆయన తెలిపారు. పౌర అవసరాలకోసం ఇప్పటివరకు 1200సార్లు సైనిక దళాలను రంగంలోకి దించారని ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మాటలు వద్దు.. చేతల్లో చూపించండి: ప్రణబ్
గౌహతిలో పేలుళ్లు : 5 మంది మృతి
దిగ్విజయ్‌సింగ్‌కు లోకాయుక్త క్లీన్‌చిట్
మలితరం రాకెట్‌ను రూపొందిస్తున్న ఇస్రో
భారత సైనికాధికారులకు వేతన పెంపు
నిఘా నీడలో కొత్త సంవత్సర వేడుకలు