ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఎంతకైనా తెగిస్తాం.. ఖబడ్దార్: ప్రధాని హెచ్చరిక
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎంతకైనా తెగిస్తాం.. ఖబడ్దార్: ప్రధాని హెచ్చరిక
FileFILE
దేశ రక్షణలో భాగంగా అవసరమైతే ఎంతకైనా తెగించేందుకు వెనుకాడబోమని ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌ ఉద్ధేశించి చేసినవే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. షిల్లాంగ్‌లో శనివారం 96వ ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలన పరస్పర సహకారంపై ఆధారపడి ఉంటుందని ఈ వాస్తవాన్ని పొరుగు దేశం పాకిస్థాన్‌ నాయకత్వం గుర్తించి తన వైఖరిని మార్చుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తీవ్రవాద సమస్యకు యుద్ధం పరిష్కార మార్గం కాదన్నారు.

ముంబై దాడులకు సూత్రధారులను పాకిస్థాన్ భారత్‌కు అప్పగించి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై ఒత్తిడి తీవ్రమైందని ప్రధాని సూచన ప్రాయంగా వెల్లడించారు. అలాగే ముంబై దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా అమెరికా పాకిస్థాన్‌కు ఇప్పటికే అందజేసిందన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయాలి: అబ్దుల్ కలాం
ఆధారాలతో అమెరికాకు హోంమంత్రి చిదంబరం
యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు: ప్రధాని
డబ్బుకోసం కాదు...గౌరవంకోసం...
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తాం: మన్మోహన్‌