ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > క్రైస్తవ మతస్తులకు రక్షణ కల్పించండి: సుప్రీం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
క్రైస్తవ మతస్తులకు రక్షణ కల్పించండి: సుప్రీం
FileFILE
రాష్ట్రంలోని క్రైస్తవ మత ప్రజలకు పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా ఒరిస్సా ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఉద్రిక్త ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మొహరించే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయంగా వ్యవహించాలని కోరారు. గత సెప్టెంబరులో విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మణానంద స్వామి ఆగస్టు 23వ తేదీన హత్యకు గురయ్యాడు. ఈ హత్యానంతరం ఒరిస్సా రాష్ట్రంలో ఘర్షణలు చెలరేగిన విషయం తెల్సిందే.

అప్పటి నుంచి రాష్ట్ర శాంతి భద్రతలను సుప్రీం కోర్టు నిశితంగా పరిశీలిస్తోంది. అంతేకాకుండా ఒరిస్సా రాష్ట్రానికి అదనపు సంఖ్యలో పారామిలిటరీ బలగాలను తరలించాలని గత అక్టోబరు 22వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీం కోర్టు ఒరిస్సా ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. రాష్ట్రంలోని మైనారిటీ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వందేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కోల్‌కతాలో కల్తీ సారాకు 14 మంది మృత్యువాత
పాక్‌కు సాక్ష్యాలను అందజేశాం: ప్రణబ్ ముఖర్జీ
నేడు ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణ స్వీకారం
ఎంతకైనా తెగిస్తాం.. ఖబడ్దార్: ప్రధాని హెచ్చరిక
ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయాలి: అబ్దుల్ కలాం
ఆధారాలతో అమెరికాకు హోంమంత్రి చిదంబరం