ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ముఖ్యమంత్రుల చర్చ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ముఖ్యమంత్రుల చర్చ
ఉగ్రవాద సమస్యపై సమగ్రంగా చర్చించేందుకు, దేశవ్యాప్తంగా నిఘా సమాచారాన్ని సమన్వయ ధోరణితో పంచుకునేందుకు పటిష్ట వ్యూహాన్ని రూపొందించేందుకోసం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు.

సిఎంల భేటీలో ఉగ్రవాద నిరోధంపై కేంద్ర రాష్ట్రాలు నిఘా సమాచారాన్ని ఎలా పంచుకోవాలి అనే విషయం పైనే ప్రధానంగా చర్చ సాగుతుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర గుప్తా చెప్పారు.

ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి పి చిదంబరం ప్రసంగించనున్నారు. ముంబై దాడుల నేపధ్యంలో ఈ సమావేశం జరుగుతున్నందున ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కీలక సమయాల్లో నిఘా సమాచార పంపిణీ ఒక్కటే ఉగ్రవాద నిరోధక యంత్రాంగంగా పనిచేయగలుగుతుందని గుప్తా చెప్పారు.

ఉగ్రవాద నిరోధానికి రాష్ట్ర స్థాయిలో ఏం చేయవచ్చు, ఆయుధాలు, సాయుధ బలగాలు, నగదు విషయంలో కేంద్రం రాష్ట్రాలకు ఎలా సహాయం చేయవచ్చు అనే అంశాలపై ఈ ఒకరోజు సమావేశం చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటుందని గుప్తా చెప్పారు.

రాష్ట్రాల పోలీసు శాఖల ఆధునీకరణకు బడ్జెట్‌ను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుప్తా చెప్పారు. అయితే కేంద్ర నిధులను పోలీసు హౌసింగ్ వంటి వాటికోసం కాకుండా ఆయుధాల కొనుగోలు, ప్రత్యేక రవాణా అవసరాలు వంటి వాటికి వ్యయం చేయవలసి ఉంటుందని తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సమ్మెలో 60లక్షల లారీలు: కొనుగోళ్లకు జనం పరుగులు
పాక్ మెడలు వంచాలి: అద్వానీ సూచన
క్రైస్తవ మతస్తులకు రక్షణ కల్పించండి: సుప్రీం
కోల్‌కతాలో కల్తీ సారాకు 14 మంది మృత్యువాత
పాక్‌కు సాక్ష్యాలను అందజేశాం: ప్రణబ్ ముఖర్జీ
నేడు ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణ స్వీకారం