ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > బాబ్రీ సంఘటనకు నైతికబాధ్యత వహించాను: కళ్యాణ్ సింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాబ్రీ సంఘటనకు నైతికబాధ్యత వహించాను: కళ్యాణ్ సింగ్
గతంలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని కళ్యాణ్ సింగ్ పేర్కొన్నారు.

ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీనుండి వైదొలగిన తర్వాత ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముస్లింలు, ఇతరవర్గాల ప్రజలు ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై నిరసన వ్యక్తపరిచారు.

కళ్యాణ్‌సింగ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై ఆ పార్టీకి చెందిన నాయకులు కొందరు విముఖత చూపడంపై ఆయన స్పందిస్తూ తాను సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై ముస్లిం సోదరులు, హిందువులనుండి నాకు ఉత్తరాలు, ఫోన్లు, ఈ-మెయిల్స్ వస్తున్నాయని, నా ఈ నిర్ణయం సరైనదేనని వారు పంపిన సందేశాలలో నాకు వెన్నుదన్నుగా నిలుస్తామని సమాచారమున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గతంలో తాను భాజపాలోనున్నప్పుడు చేసిన తప్పిదాలు, అలాగే ముస్లింలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టనని ఈ సందర్భంగా సమాజ్ వాదీ ఎంపీలకు ఆయన భరోసా ఇచ్చారు.

సెక్యులరిజానికి ఎలాంటి సర్టిఫికేట్ అవసరంలేదని, ముస్లింలు భాజపాకు వ్యతిరేకం కాని నాకు కాదని, నేను ప్రజలకు చేసిన సహాయాలే నన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయని ఆయన తెలిపారు.

అలాగే ముస్లిం సోదరులు నేను భాజపాకు రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై వారు హర్షం ప్రకటించి నాకు స్వాగతం పలికారని దేశంలో ప్రస్తుతం కుల రాజకీయాలు ఎక్కువైనాయని ఆయన కొత్తరాగాన్ని ఆలపించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్-ఎస్పీ పొత్తుకు ప్రమాదం కాదు: ములాయం
పాక్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధం: సోనియా
వామపక్షాలతోనే దోస్తీ బెస్ట్: లాలూ
శ్రీలంక తమిళులకు మద్దతుగా తమిళనాడు బంద్
వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరిక: నిలకడగా ఆరోగ్యం
పొరుగు దేశాల వల్ల పెరుగుతున్న తీవ్రవాదం: సోనియా