ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కేరళ రోడ్డు ప్రమాదంలో 11మంది తెలుగువారు మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కేరళ రోడ్డు ప్రమాదంలో 11మంది తెలుగువారు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని విస్సాకోడేరునుంచి దక్షిణ భారత దేశ యాత్రకు బస్సు బయలుదేరింది. ఇందులో భాగంగా కేరళలోని శబరిమలకు వెళుతుండగా మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది తెలుగువారు మృతి చెందారు.

ఈ టూరిస్ట్ బస్ శబరిమల వెళుతుండగా ఎరిమేరి ప్రాంతంలోని పంబా లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరో నలభైమంది గాయపడ్డారు.

వీరిలో ఇరవైమంది పరిస్థితి విషమంగావుందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక కొట్టాయం మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ఇరుకుగా ఉండటం, వెలుతురు సరిగా లేకపోవటంతో బస్ అదుపు తప్పి లోయలోకి పడటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మరణంచినవారిలో ఎక్కవగా మహిళలు, చిన్న పిల్లలే ఉన్నట్లు సమాచారం.

ఇదిలావుండగా ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు శబరిమల ఆలయ బోర్డు లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కొట్టాయం జిల్లా కలెక్టర్ వేణు పర్యవేక్షణలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భద్రతాదళంలో చేరిన జెట్ టెక్నాలజీ నౌకలు
విదేశాంగ శాఖ కంప్యూటర్ల సమాచారం హైక్
మందిర నిర్మాణంతో రుణం తీర్చుకుంటాం: అద్వానీ
రక్షణ రంగానికి రూ.1,41,703 కోట్లు: ప్రణబ్
కసబ్‌ను అప్పగించేది లేదు: భారత్
ఆరవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన యూపీఏ