మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్దేవ్ భారతదేశంలోని యువకులు సైన్యంలో చేరాలని పిలుపునిచ్చాడు. దేశం కోసం ప్రతి యువకుడు సైనికుడుగా మారాలని ఉద్వేగభరితంగా మాట్లాడారు.
పంజాబ్లోని ఓ సైనిక శిక్షణ శిబిరంలో పాల్గొన్న కపిల్ పాత్రికేయులతో మాట్లాడుతూ... " నాకు భారత సైన్యం అంటే ఎంతో ఇష్టం. అలాగే నా ప్రజలంటే కూడా. సైన్యంలో చేరేందుకు మనవంటివారి ముందుకు రాకపోతే ఇంకెవరు వస్తారు. నా ఆలోచన ప్రకారం ప్రతి యువకుడు సైన్యంలో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ భారతదేశ సైన్యం మనవంటి వారికోసం ఎదురు చూస్తోంద"ని చెప్పారు.
కాగా కపిల్దేవ్ గత మూడు రోజులుగా సైనిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని శిక్షణాధికారి లాగ్షార్ తెలిపారు. శిక్షణా కాలంలో కపిల్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి నేర్చుకున్నారన్నారు. |