ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > సీపీఐ(ఎమ్) కేంద్ర కమిటీ సమావేశాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సీపీఐ(ఎమ్) కేంద్ర కమిటీ సమావేశాలు
వచ్చే లోక్‌సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీపీఐ(ఎమ్) కేంద్ర కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమవుతోంది. భవిష్యత్తులో సీపీఐ అనుసరించబోయే విధివిధానాలు, ప్రజలకు చేయదలచిన మేలు తదితర అంశాలతో ఎన్డీఏ, యూపీఏలను తలదన్నే విధంగా మ్యానిఫెస్టోకు ఈ సమావేశంలో తుది మెరుగులు దిద్దనున్నారు.

కాంగ్రెస్, భాజపాలతో ప్రజలు విసిగి పోయారనీ, తృతీయ ప్రత్యామ్నంపై ఆశలు పెట్టుకున్నారని సీపీఐ అధికారి ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎస్ రామచంద్రన్ మాట్లాడుతూ... రానున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా తాము అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ ఉంటుందన్నారు.

కాగా లోక్‌సభకు పోటీ చేసే 80మంది అభ్యర్థుల జాబితాను సీపీఐ(ఎమ్) ఇప్పటికే విడుదల చేసింది. కాంగ్రెస్, భాజపాలను ఓడించడమే లక్ష్యంగా భావసారూప్య పార్టీలతో పొత్తులపై చర్చలు సాగుతున్నాయని రామచంద్రన్ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పాకిస్థాన్ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం
హోం మంత్రి కర్ణాటక పర్యటన మళ్లీ వాయిదా
ప్రభుత్వం ప్రోత్సహించలేదు: విజయ్ మాల్యా
ఎన్నికల సమరం: కాంగ్రెస్-ఎస్పీ పొత్తు విచ్ఛిన్నం
దత్ శిక్షపై కేంద్రం వివరణ కోరిన సుప్రీం
కూలిన విమానం: ముగ్గురు పైలెట్లు దుర్మరణం