ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కాంగ్రెస్‌-ఎస్పీ పొత్తుకు అవకాశాలు: యాదవ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెస్‌-ఎస్పీ పొత్తుకు అవకాశాలు: యాదవ్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తుకు ఇంకా అవకాశాలు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ వెల్లడించారు. ఆయన ఆదివారం న్యూఢిల్లీలోని ఎస్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో సత్‌సబంధాలు కొనసాగుతాయని చెప్పారు. దీనికి నిదర్శనమే, కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేసే ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపబోమని ఆయన ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్లకు ఎస్పీ పోటీ చేస్తున్న తెల్సిందే. ఆదివారం మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపేందుకు చర్చిస్తున్నట్టు చెప్పారు. అయితే, అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీతో సత్‌సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు.

ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్న 24 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో రాంపూర్, ప్రతాప్‌గర్, పర్రూఖ్‌బాద్, సలీంపూర్‌ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్థానాలకు ఎస్పీ సిట్టింగ్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అయితే, ఇరు పార్టీలు మధ్య అగ్రనేతలపై పోటీకి దింపబోమని ప్రకటించారు.

రాయ్‌బరేలిలో సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ కాంధీ, మణిపూర్‌లో ములాయం సింగ్ యాదవ్, కన్నుజ్‌లో అఖిలేష్ యాదవ్‌లు పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. కాగా, ఎన్నికల ముందు పొత్తు కుదరకపోయినా, ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తామని ములాయం వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్-భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటు: బర్ధన్
భవిష్యత్తులో గాంధీజీ వస్తువుల వేలానికి బ్రేక్
పొత్తు విచ్ఛిన్నం: భాజపా అత్యవసర భేటీ
కాంగ్రెస్‌ను ఎదుర్కొంటాం: ఎస్పీ
ఒరిస్సాలో ముగిసిన భాజపా-బీజెడీ స్నేహబంధం
వెంకయ్యా...అలా మాట్లాడకయ్యా : బర్దన్