ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > బీజేడీతో సీపీఎం ఎన్నికల పొత్తు: ఏచూరీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బీజేడీతో సీపీఎం ఎన్నికల పొత్తు: ఏచూరీ
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోనున్నట్టు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ వెల్లడించారు. ఈ అశంపై ఆయన నవీన్‌తో చర్చలు జరుపుతామని ఆయన ఆదివారం స్వయంగా వెల్లడించారు. ఇదిలావుండగా, మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ మాత్రం, తృతీయ కూటమలో చేరాల్సిందిగా కోరుతూ నవీన్‌కు లేఖ రాశారు. దీంతో ఒరిస్సా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటిరిగా బరిలోకి దిగుతుందని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇదిలావుండగా, ఈనెల 11వ తేదీన బలపరీక్షకు సిద్ధమవుతున్న నవీన్ పట్నాయక్‌కు వామపక్షాలు, ఎన్.సి.పి వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయన గెలుపు సాధ్యమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం భాజపా మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో పడిన బీజేడీ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భాజపా, బీజేడీల మధ్య ఉన్న 11 సంవత్సరాల పొత్తు విచ్ఛిన్నమైన విషయం తెల్సిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరుపనున్నట్టు ఏచూరీ వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బల నిరూపణపై ఒరిస్సా సీఎంకు గవర్నర్ ఆదేశం
కాంగ్రెస్‌-ఎస్పీ పొత్తుకు అవకాశాలు: యాదవ్
కాంగ్రెస్-భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటు: బర్ధన్
భవిష్యత్తులో గాంధీజీ వస్తువుల వేలానికి బ్రేక్
పొత్తు విచ్ఛిన్నం: భాజపా అత్యవసర భేటీ
కాంగ్రెస్‌ను ఎదుర్కొంటాం: ఎస్పీ