ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బుధవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈరోజున జరిగే బలపరీక్షలో తాము ఖచ్చితంగా నెగ్గుతామని బీజేడీ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది.
కాగా బీజేడీకి స్పీకర్తో సహా 61మంది సభ్యులుండగా జేఎమ్ఎమ్ పార్టీకిచెందినవారు నలుగురు. ఎన్సీపీకి చెందినవారు ఇద్దరు, సీపీఐ, సీపీఎమ్ చెరి ఒకరు తమ పార్టీకి మద్దతునిస్తున్నట్లు బీజేడీ పార్టీ ప్రతినిధి తెలిపారు.
వీరితో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఏడుగురు ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఇదిలావుండగా మరో ఎమ్మెల్యే సభకు గైర్హాజరు కావడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. |