సమాజ్వాదీ పార్టీకి చెందిన సభ్యురాలు, ప్రముఖ సినీనటి జయప్రద ఓటర్లకు డబ్బులు పంచినట్లు భారతీయ జనతాపార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్లోని రామ్పుర్ నియోజకవర్గానికి సమాజ్ వాదీ పార్టీ తరపున జయప్రద అక్కడి ఓటర్లకు డబ్బులు పంచి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధికారికంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని బీజేపీకి చెందిన నాయకుడు రామకృష్ణ తెలిపారు. |