ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఏప్రిల్ 6న కసబ్‌ విచారణ: కొత్త లాయర్ నియామకం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఏప్రిల్ 6న కసబ్‌ విచారణ: కొత్త లాయర్ నియామకం
ముంబయిపై జరిగిన తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ అమిర్ కసబ్ కోసం ప్రత్యేక కోర్టు న్యాయవాదిని నియమించింది. కసబ్ కేసు ఏప్రిల్ ఆరున విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు నిర్ణయం ప్రకారం అంజలీ వాగ్మరే అనే ఈ లాయర్ కసబ్ తరపున విచారణకు హాజరుకానున్నారు.

ఈ విషయమై న్యాయమూర్తి ఎమ్ఎల్ తహిల్యానీ మాట్లాడుతూ కసబ్ కోసం నియమించిన న్యాయవాది వాగ్మరేకు సహాయం కోసం మరో న్యాయవాదిని కూడా నియమించనున్నట్టు తెలిపారు. ముంబయిలోని ఆర్థూర్ రోడ్ జైలులో ఉన్న కసబ్‌పై విచారణ ఏప్రిల్ ఆరునుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తనకు లాయర్‌ను నియమించిన విషయాన్ని కోర్టు కసబ్‌కు తెలియజేసింది.

దీంతోపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు నియమించిన న్యాయవాదిని కసబ్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కసబ్ మాట్లాడుతూ లాయర్‌ను నియమించడంపై అభ్యంతరమేమీ లేదని పేర్కొన్నాడని అధికారులు తెలిపారు. అలాగే తనకు వార్తా పత్రికలు కావాలంటూ కసబ్ కోర్టును అడిగినట్టు అధికారులు పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జయ హో...అందరిదీ...ఏ.ఆర్.రెహ్మాన్
యూపీఏలో "బ్లాక్ డే"ను పాటిస్తున్న భాజపా
స్విస్ బ్యాంకు నల్లధనం వెలికి తీస్తాం: అద్వానీ
వరుణ్ గాంధీపై నాసా చట్టం ప్రయోగం
కాంగ్రెసే మా రాజకీయ ప్రధాన ప్రత్యర్థి: అద్వానీ
వరుణ్‌కు వీఐపీ వసతులు నిల్: జైలు సిబ్బంది