ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > అస్సోంలో కారు బాంబు పేలుడు: నలుగురి మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అస్సోంలో కారు బాంబు పేలుడు: నలుగురి మృతి
అస్సాం రాష్ట్రంలోని గౌహతికి సమీపంలోని మాలిగాన్ ప్రాంతంలో సోమవారం సంభవించిన బాంబు పేలుడు కారణంగా కనీసం నలుగురు మృతి చెందగా మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రంలోని దిబ్రూగర్‌లో మంగళవారం ఓ ఎన్నికల ప్రచారసభలో పాల్గొననున్న తరుణంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.

జలక్‌పరి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఓ మోటారు సైకిల్‌లో ఉంచిన బాంబు పేలిన కారణంగా ఈ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు కారణంగా ఆ ప్రదేశంలోని చాలా కార్లు భారీగా ధ్వంసమయ్యాయి.

ఈ విషయమై అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హెమంత బి శర్మ మాట్లాడుతూ ఈ పేలుడు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు భద్రత కోసం మరిన్ని దళాలను పంపాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో ఇలాంటి ఘటనల వల్ల శాంతియుతంగా ఎన్నికలు జరపాలన్న తమ నిర్ణయానికి విఘాతం ఏర్పడబోదని ఆయన స్పష్టం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ: తాజా సర్వే
రాష్ట్రపతితో సమావేశమైన ప్రధాని మన్మోహన్
పీఎంపై విమర్శలు దేశాన్ని అవమానించడమే: సోనియా
అమెరికా నిర్ణయం పట్ల ప్రణబ్ హర్షం
ముంబై దాడుల అంశంలో కేంద్రం విఫలం: మోడీ