ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > అణు ఒప్పందంపై పునరాలోచన: ఏచూరి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అణు ఒప్పందంపై పునరాలోచన: ఏచూరి
తృతీయ కూటమి అధికారంలోకి వస్తే అమెరికాతో కుదుర్చుకున్న వివాదాస్పద పౌర అణు సహాకార ఒప్పందంపై పునరాలోచిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం వివాదాస్పద రీతిలో అమెరికా ప్రభుత్వంతో ఈ ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై గతంలో దేశంలో పెద్దఎత్తున రాజకీయ దుమారం చెలరేగిన విషయం విదితమే. ఈ అణు ఒప్పందం కారణంగా తలెత్తిన విభేదాలతోనే వామపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాయి. తాజాగా ఈ వివాదాస్పద ఒప్పందాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెరపైకి తీసుకువచ్చారు

తృతీయ కూటమి అధికారంలోకి వస్తే, అణు ఒప్పందంపై పునరాలోచన జరుపుతామని సీతారాం ఏచూరి ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్‌పై ఒత్తిడి పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌యేతర లౌకికవాద సుస్థిర ప్రభుత్వాన్ని తృతీయ కూటమి అందించగలదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో తృతీయ కూటమికి మంచి స్పందన వస్తోందని చెప్పారు. 1996, 1998నాటి పరిస్థితులు పునరావృతం కాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కసబ్‌పై ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభం
ఒబామా(ఒసామా) బిన్ లాడెన్: నోరు జారిన అద్వానీ
నేడు 5వ విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ
నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం: తెల్గీకి ఏడేళ్ల శిక్ష
వంద రోజుల్లో నల్లధనం వెలికితీత: అద్వానీ
పార్టీ తరపున వరుణ్ ప్రచారం: రాజ్‌నాథ్ సింగ్