అమేథీలో పోలింగ్ తక్కువగా నమోదైనప్పటికీ, రాహుల్ గాంధీ సునాయాసంగా విజయం సాధిస్తారని ఆయన సోదరి ప్రియాంకా గాంధీ జోస్యం చెప్పారు. అమేథీలోని కొన్ని గ్రామాల ప్రజలు ఏకమొత్తంగా పోలింగ్ను బహిష్కరించడంపై ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ చర్య రాహుల్పై ఉత్పన్నమైన వ్యతిరేకత అయివుండదని తాను అభిప్రాయపడుతున్నట్లు ప్రియాంక తెలిపారు. అంతిమంగా ప్రజలు చాలా తెలివైన వారని, ఓటు వేయనందుకు కూడా వారు సహేతుక కారణంగా చెబుతారని అన్నారు. అమేథీలో ఒకవేళ రాహుల్ గెలవకపోతే అప్పుడు మీడియా తనను ప్రశ్నించవచ్చని సమాధానం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ లోక్సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్కు సోదరి ప్రియాంక విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే. రాహుల్తో పాటు తల్లి సోనియా పోటీ చేస్తున్న రాయబరేలీలోనూ ప్రియాంక ప్రచారం నిర్వహించారు. అయితే ప్రియాంక ప్రచారం చేసిన గ్రామాలు ఓటింగ్కు గైర్హాజరు కావడం, ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం కొసమెరుపు. |