ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > తృతీయ కూటమిదే అధికారం: ప్రకాష్ కారత్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తృతీయ కూటమిదే అధికారం: ప్రకాష్ కారత్
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో తృతీయ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ జోస్యం చెప్పారు. ఆయన భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రభుత్వ ఏర్పాటులో బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కీలక పాత్ర పోషించగలరన్నారు.

నాలుగో దశ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పరిస్థితిపై మదింపు వేయగా రాజకీయ పార్టీలలో ఏ ఒక్కదానికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, భాజపా యేతర పార్టీలు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సూచనలే మెండుగా కనిపిస్తున్నాయని కారత్ అన్నారు.

ఒరిస్సాలో బీజేడీ తిరిగి అధికారంలోకి రాగలదని కారత్ ధీమా వ్యక్తం చేస్తూ, కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వ స్థాపనలో నవీన్ ముఖ్య పాత్ర పోషించగలరని అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశం లేదని కారత్ స్పష్టం చేస్తూ, తృతీయ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్, బీజేపీయేతర లౌకిక రాజకీయ పార్టీలన్నింటికీ ఆయన విజ్ఞప్తి చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్: తీవ్రవాది మృతి
కాంగ్రెస్ మీడియా ఛైర్మన్‌గా మొయిలీకి ఉద్వాసన
వరుణ్‌పై నాసా చెల్లదు: యూపీ సలహా సంఘం
మన దేశంలో స్వైన్‌‌ఫ్లూ లేదు: కేంద్రమంత్రి
బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది: అద్వానీ
కాంగ్రెస్, బీజేపీలను ఓడించే సత్తా మాకుంది: కారత్