ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కేంద్రంలో హంగ్ సంకేతాలతో మాయ ఖుషీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కేంద్రంలో హంగ్ సంకేతాలతో మాయ ఖుషీ
కేంద్రంలో హంగ్ తప్పదన్న సంకేతాలు రావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి పట్టలేని సంతోషంతో ఉన్నట్లు సమాచారం. ఈ ఆనందాన్ని తృతీయ కూటమి నేతలతో పంచుకున్నారు. గురువారం కూటమి నాయకులను విందుకు ఆహ్వానించి మరీ వారితో సంతోషాన్ని పంచుకున్నారు. ఇక మిగిలినదల్లా శనివారం తమ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని ఎదురు చూడటమే.

ఎగ్జిట్ పోల్స్ అంతా ట్రాష్ అని ప్రధాన పార్టీలన్నీ కొట్టి పారేసినా, ఆ ఫలితాల తర్వాత పాత మిత్రులను దువ్వే పనిలో పడ్డాయి. ఈ వ్యవహారాన్ని మరింత నిశితంగా గమనించడానికి బీఎస్పీ చీఫ్ మాయావతి మిశ్రాను ఢిల్లీకి పంపించారు. పనిలోపనిగా తృతీయ కూటమి నేతల కదలికలను కూడా చూస్తుండమని పురమాయించినట్లు సమాచారం.

మరోవైపు తృతీయ కూటమిని అధికారంలోకి తేవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇదిలావుంటే మాయవతిని కాంగ్రెస్ సహా ఎన్డీఏ నాయకులు సైతం ఫోనులో సంప్రదించినట్లు తెలుస్తోంది.

మే 16 తర్వాత మాత్రమే పొత్తులపై పూర్తిగా మాట్లాడలేనని మాయ అన్నట్లు సమచారం. అంతేకాదు తమ పార్టీ నేతలను సైతం ఫలితాలు వచ్చేవరకూ నోరు మెదప వద్దని హుకుం జారీ చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భారత్ రసాయన ఆయుధాలు ధ్వంసం
వరుణ్‌పై నాసాను ఎత్తివేసిన యూపీ ప్రభుత్వం
వరుణ్‌పై నాసాను ఎత్తివేసిన యూపీ ప్రభుత్వం
భారత్...బంగ్లా సరిహద్దుల్లో ఇకపై వెలుగులు
పవార్, లాలూతో సోనియా మంతనాలు
భారత్ రాజకీయాల్లో అమెరికా జోక్యాన్ని ఒప్పుకోం: లెఫ్ట్