ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > దేశంలో కరువు పరిస్థితులు లేవు: పవార్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశంలో కరువు పరిస్థితులు లేవు: పవార్
దేశంలో కరువు పరిస్థితులు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు. రుతుపవనాలు ఆశాజనకంగా లేకపోవడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రుతుపవనాల జాప్యమైనప్పటికీ, దేశంలో కరువు పరిస్థితులు నెలకొని లేవని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ధరల పెరుగుతాయని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆహార ధాన్యాల సేకరణ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోగలదని, ప్రభుత్వం వద్ద కావాల్సిన స్థాయిలో ఆహార నిల్వలు ఉన్నాయన్నారు.

జులై- ఆగస్టులో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నైరుతీ రుతుపవనాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒరిస్సా దక్షిణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లతోపాటు, దేశ వాయువ్య ప్రాంతంలోనూ వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
విదేశాల్లో భారతీయల కోసం డేటా బ్యాంక్
సల్వాజుడుం నేతను హత్య చేసిన మావోలు
కేంద్రం వద్ద పది కొత్త రాష్ట్రాల డిమాండ్‌లు
బెంగాల్: రామ్‌గఢ్ భద్రతా దళాల కైవసం
వాతావరణ మార్పు ఉగ్రవాదులకు సాయం కావచ్చు
ములాయం సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు