ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కంధమాల్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కంధమాల్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణ
ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలోని నాలుగు కంపెనీల కేంద్ర పారామిలిటరీ దళాలను బుధవారం ఉపసంహరించారు. గత ఏడాది మత ఘర్షణల కారణంగా శాంతి, భద్రతలను పరిరక్షించేందుకు కంధమాల్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించారు. కేంద్ర బలగాలను బుధవారం జిల్లా నుంచి ఉపసంహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

వివిధ దశల్లో కేంద్ర బలగాలను కంధమాల్ నుంచి ఉపసంహరించారు. తాజాగా నాలుగు కంపెనీల పారామిలిటరీ దళాలను వెనక్కు వెళ్లిపోవడంతో కంధమాల్ జిల్లాలో దళాల ఉపసంహరణ పూర్తయిందని ఒరిస్సా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరుణ్ సారంగీ తెలిపారు. కేంద్ర బలగాలు జూన్ 30 వరకు మాత్రమే కంధమాల్‌లో ఉంచాలని నిర్ణయించారు.

గడువు తీరడంతో దళాలను ఉపసంహరించారని, వారి స్థానంలో పోలీసు సిబ్బందిని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంచామని అరుణ్ వెల్లడించారు. గత ఏడాది మత ఘర్షణలు చెలరేగడంతో మొత్తం 4 వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని కంధమాల్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు.

గత ఏడాది ఆగస్టు 23న విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మానంద సరస్వతి, ఆయన అనుచరులు హత్యకు గురికావడంతో ఈ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయి. కొన్ని నెలలపాటు జరిగిన హింసాకాండలో 38 మంది పౌరులు మృతి చెందారు. అంతేకాకుండా 25 వేల మంది క్రైస్తవులు స్వగ్రామాలను విడిచి సహాయక శిబిరాలకు తరలివెళ్లారు. ఇప్పటికీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మూడు సహాయక శిబిరాల్లో 1200 మంది పౌరులు తలదాచుకుంటున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మమత రైల్వే బడ్జెట్‌లో ఛార్జీల పాక్షిక సవరణ
ఎన్ఎస్‌జీ హబ్‌లలో ఆర్మీ ప్రత్యేక దళాలు
ఎంపీ మందాను వివరణ కోరిన అధిష్టానం : మెయిలీ
భారత కొత్త విదేశాంగ కార్యదర్శిగా నిరుపమ
దేశవ్యాప్తంగా 113 స్వైన్ ఫ్లూ కేసుల నమోదు
ప్రతిపాదిత తొలి ఎన్ఎస్‌జీ హబ్ ప్రారంభం