సిబాల్ ఇటీవల సూచించిన సింగిల్ బోర్డు పరీక్షా పద్ధతిని భాజపా పాలిత రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులు తోసిపుచ్చారు. పిల్లలపై ఒత్తిడి పడకుండా చూడాల్సిన బాధ్యత నిజమేననీ, అయితే సిబాల్ చెప్పినట్లుగా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఏదిబడితే అది అనుసరించడం సాధ్యం కాదన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మురళీ మనోహర్ జోషీ మాట్లాడుతూ, ఇటువంటి సూచనలను చేసేముందు సిబాల్ విద్యావేత్తలను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులేమైనా చేయదలచుకున్నప్పుడు దానిపై లోతుగా కసరత్తు చేయాలనీ, విద్యా రంగంలోని నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు... ఇలా అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని జోషి అన్నారు.
ఈ సమావేశంలో ఎన్డీఎ కన్వీనర్ శరద్ యాదవ్, మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, భాజపా పాలిత రాష్ట్రాల విద్యామంత్రులు పాల్గొన్నారు. |