కేంద్ర రైల్వే శాఖ మంత్రి శుక్రవారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి బడ్జెట్ను కూడా ప్రజాకర్షక నిర్ణయాలకు పెద్దపీట వేశారు. ఇది మరో ప్రజల బడ్జెట్ అని, ప్రజాస్వామ్య బడ్జెట్ అని బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తున్న సందర్భంగా మమతా బెనర్జీ ప్రకటించారు.
మమత రైల్వే బడ్జెట్ హైలెట్స్: · వ్యాపార అవసరాల కోసం రైల్వే భూములను అద్దెకిస్తారు · వికలాంగుల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రత్యేక రిక్రూట్మెంట్ వ్యవస్థ · టాలీగుంజ్లోని మెట్రో రైల్ ఆస్పత్రి ఆధునికీకరణ · రైల్వే సిబ్బంది ఆస్పత్రుల అభివృద్ధి · గ్రూపు బి రైల్వే ఉద్యోగుల పిల్లలకోసం బాలికల స్కాలర్షిప్లు · ప్రధాన రూట్లలో మహిళా కమాండోల సంఖ్య పెంపు · వికలాంగ ప్రయాణికుల కోసం ర్యాంపులు, ప్రత్యేక బోగీలు · ఇంటర్సిటీ రైళ్లలో డబుల్ డెక్కెర్ ఏసీ కోచ్లు · పోస్టాఫీసుల్లో రైల్వే టిక్కెట్లు విక్రయం, దేశవ్యాప్తంగా ఐదు వేల పోస్టాఫీసుల ఎంపిక · వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టిక్కెట్ల వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ చేసే సౌకర్యం · 200 స్టేషన్లలో ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషిన్లు · 200 కొత్త పట్టణాలు, నగరాల్లో రైల్వే టిక్కెట్ల విక్రయం · రాజధాని, శతాబ్ది రైళ్లలో ఇన్ఫోటైన్మెంట్ (వ్యక్తులు లేదా చారిత్రక ఘటనల గురించి తెలిపే టీవీ కార్యక్రమాలు) సేవలు · మత ప్రాధాన్యం కలిగిన 49 స్టేషన్ల స్థాయి పెంపు · సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కొత్తగా ఆంబులెన్స్ సేవలు · సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఒక వైద్యుడు · దేశవ్యాప్తంగా 50 రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు · రైళ్లలో, స్టేషన్లలో భద్రతను పటిష్టపరచడంపై దృష్టి · ముంబయి హౌరా, ఢిల్లీ, చెన్నై, తిరువనంతపురం రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ స్థాయి · స్త్రీలు, వికలాంగులకు ప్రత్యేక కోచ్లు, ఎస్కలేటర్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు · సాధారణ టిక్కెట్లకు 5 వేల నుంచి 8 వేల వరకు వెండింగ్ మిషిన్లు · రైల్వే స్టేషన్లలో శుభ్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యత · దేశవ్యాప్తంగా 375 స్టేషన్లు ఆధునికీకరణ |