ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలే కారణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలే కారణం
ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలో గత ఏడాది చెలరేగిన అల్లర్లకు మతమార్పిడిలే ప్రధాన కారణమని ఆనాటి హింసాకాండపై దర్యాప్తు జరుపుతున్న ఓ న్యాయ విచారణ కమిషన్ వెల్లడించింది. కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలు ప్రధాన కారణమయ్యాయని ఈ కమిషన్ పేర్కొంది.

భూవివాదాలు, మత మార్పిడిలు, నకిలీ సర్టిఫికేట్ వివాదాలు హింసాకాండకు మూలాలని న్యాయమూర్తి ఎస్‌సీ మహోపాత్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు 23న ఓ మతపెద్ద, ఆయన అనుచరుల హత్యల అనంతరం కంధమాల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సందర్భంగా కంధమాల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర మత ఘర్షణలు జరిగాయి. ఈ హింసాకాండలో 43 మంది పౌరులు మృతి చెందారు. అంతేకాకుండా అనేక ఇళ్లు, చర్చిలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా సమర్పించిన మధ్యంతర నివేదికలో మహోపాత్ర మతమార్పిడిల గురించి కూలంకుషంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దేశంలో 116కు చేరుకున్న స్వైన్ ఫ్లూ కేసులు
మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
తొలి స్వైన్ ఫ్లూ మరణం: కేరళలో నమోదు
ఇది ప్రజల బడ్జెట్: లోక్‌సభలో మమతా బెనర్జీ
దేశానికి దేశీయ రైల్వేమంత్రి ఎప్పుడు లభిస్తారో...?
జడ్జిల ఆస్తులు బయటపెట్టాల్సిన అవసరం లేదు