ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగు న్యాయం చేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప అన్నారు.
రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... శుక్రవారం ప్రవేశపెట్టబడిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలు, ఎంపీలు బాధపడాల్సిన అవసరం లేదని, ఆ రాష్ట్రానికి సరైన న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదిలావుండగా యూపీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కీలక పాత్ర పోషించారని, ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని విస్మరించే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. |