పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో నక్సల్ ఏరివేత కార్యక్రమంలో 17వ రోజు కూడా కొనసాగుతోంది. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ శనివారానికి 17వ రోజుకు చేరుకుంది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ప్రాంతంలోని ఒక్కో గ్రామాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
ఇప్పటివరకు భద్రతా బలగాలకు మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. తవ్విన రోడ్లను పూడ్చేస్తూ సంయుక్త బలగాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. |