ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాష్ట్రానికి రేపు రానున్న ప్రధాని, సోనియా (Prime Minister, Manmohan Singh, Congress chief, Sonia Gandhi, Chief Minister, YSR Reddy)
దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వైఎస్ పార్థీవ శరీరాన్ని చూసేందుకు శుక్రవారం హైదరాబాద్ రానున్నారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హటాన్మరణంతో హతాసులైన కాంగ్రెస్ అధిష్టానం ఆయన పార్థీవ శరీరాన్ని చూసేందుకు రేపు హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు గురువారం ఢిల్లీలో వెల్లడించాయి.
వైఎస్ మంచి పరిపాలనా దక్షుడని ఈ సందర్భంగా పార్టీ నేతలు కొనియాడారు. వైఎస్ మృతిపట్ల సంతాప సూచకంగా కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలోను ఆ పార్టీ పతాకాన్ని అవనతం చేసినట్లు సమాచారం.