జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఈశాన్య భారతదేశంలో మరోసారి భూకంపం (Quake | Manipur | Northeast | Myanmar)
 
దేశంలోని ఈశాన్య భాగంలో మరోసారి భూకంపం సంభవించింది. గడిచిన మూడు వారాల్లో ఈ ప్రాంతంలో నాలుగోసారి భూకంపం సంభవించింది. తాజాగా సంభవించిన స్వల్ప భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదయింది. శుక్రవారం తెల్లవారుజాముకు ముందు సంభవించిన ఈ భూకంపం కారణంగా స్థానికులు నిద్రలో ఉలిక్కిపడ్డారు.

మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలు, మయన్మార్ సరిహద్దుల్లో భూకంప ప్రభావం కనబడింది. శుక్రవారం 1.21 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అసోం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ప్రజలు ఈ భూకంపం కారణంగా భయకంపితులయ్యారు.

మయన్మార్‌లోనూ ఈ ప్రభావం కనిపించింది. పది సెకన్లపాటు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణభయంతో అర్ధరాత్రి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టంపై ఎటువంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.