జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » స్వదేశానికి చేరుకున్న ప్రధాని మన్మోహన్ (America | G-20 | Summit | Obama | India | PM | Manmohan Singh)
 
FILE
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న తర్వాత భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారంనాడు స్వదేశానికి తిరిగి వచ్చారు.

శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రపంచంలోని అగ్రదేశాలతోపాటు ఇతర ప్రధాన దేశాలు మాంద్యంతో అతలాకుతలమౌతున్న దేశాలకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరమని తీర్మానించాయని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో భారతదేశం చేటు సంపాదించుకుందని శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం పిట్స్‌బర్గ్ వెళ్ళిన ప్రధాని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నేతృత్వంలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.