సమాజ్వాదీ పార్టీ నేత అమర్సింగ్పై దాఖలైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు.
ఐదువందల కోట్ల రూపాయల నిధుల కుంభకోణంకు సంబంధించి ఎస్పీ నేత అమర్ సింగ్, ఆయన భార్యపై కాన్పూర్లో కేసు దాఖలైన విషయం తెలిసిందే. 14 పేజీల ఎఫ్ఆర్ఐలో సంస్థ డైరక్టర్గా ఉన్న అమితాబ్ పేరు సైతం ఈ కేసులో ప్రస్తావనకు వచ్చింది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్సు ప్యాకేజీ మ్యాక్ విజయ్కు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతోన్న అమితాబ్ మంగళవారం ఆగ్రా వచ్చారు. ఈ సందర్భంగా అమర్ కేసుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. బిగ్ బి అంతగా స్పందించలేదు. ఈ కేసుపై ఇప్పటికే అమర్ స్పందించారని, ఇందులో తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు.