ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాథోడ్కు బెయిలు మంజూరు చేసిన సెషన్స్ కోర్టు (SPS Rathore | Ruchika Girhotra | Abha Rathore | January 7 | Panchkula | Haryana | Sessions court)
రుచికా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మాజీ డిజిపి రాథోడ్కు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పంచకులలో ప్రత్యేక సెషన్స్ కోర్టు హర్యానా మాజీ డిజిపి ఎస్పిఎస్ రాథోడ్కు జనవరి ఏడవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ పోలీసు అధికారి రాథోడ్ సతీమణి ఆభా రాథోడ్, రుచికా కుటంబానికి చెందిన న్యాయవాది పంకజ్ భరద్వాజ్ వాదనలు విన్నతర్వాత జిల్లా న్యాయమూర్తి ఎస్పి సింగ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆరు జనవరి వరకు రాథోడ్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ రాథోడ్ను పోలీసులు అదుపులోకి తీసుకోదలిస్తే మధ్యంతర బెయిలుపై అతనిని విడుదల చేయాలని కూడా న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.